బాలుడిని బలిగొన్న నీటి సంపు

by  |
బాలుడిని బలిగొన్న నీటి సంపు
X

దిశ, మెదక్: సిద్దిపేటలో తీవ్ర విషాదం నెలకొంది. నీటి సంపులో పడి 18 నెలల బాలుడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జితిన్, స్వార్షి దంపతులు కొన్నాళ్లుగా సిద్దిపేట పరిధి రంగధాంపల్లిలో నివాసముంటున్నారు. వారు సిద్దిపేటలో పానీపూరి బండి నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వారి కుమారుడు హాష్ ( 18 నెలలు ) బుధవారం ఆడుకుంటు ఇంటి ఆవరణలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలుడిని సంపు నుంచి వెలికితీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

tag;boy, dead, water tank, medak, ts news


Next Story

Most Viewed