గుడ్ న్యూస్.. ఒలంపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

by  |
lovlina-borgohain
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. బాక్సింగ్ ​క్వార్టర్స్‌లో భారత్‌కు చెందిన లవ్లీనా బోర్గోహెయిన్ ఘన విజయం సాధించింది. బాక్సింగ్​ మహిళల వెల్టర్ వెయిట్(69 కేజీలు) విభాగంలో లవ్లీనా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ బాక్సర్‌పై లవ్లీనా 4-1 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చి చేరనుంది.

అయితే, సెమీస్‌లో లవ్లీనా విజయం సాధిస్తే.. ఫైనల్ చేరుతారు. ఫైనల్‌లో విజయం సాధిస్తే లవ్లీనాకు స్వర్ణం.. ఒకవేళ ఓడిపోతే రజతం వరిస్తుంది. అదీ కాకుండా సెమీస్‌లోనే లవ్లీనా ఓడిపోతే కాంస్య పతకం గెలుచుకోనుంది. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది.


Next Story

Most Viewed