- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : టోక్యో ఒలంపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది. బాక్సింగ్ క్వార్టర్స్లో భారత్కు చెందిన లవ్లీనా బోర్గోహెయిన్ ఘన విజయం సాధించింది. బాక్సింగ్ మహిళల వెల్టర్ వెయిట్(69 కేజీలు) విభాగంలో లవ్లీనా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో చైనీస్ తైపీ బాక్సర్పై లవ్లీనా 4-1 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరనుంది.
అయితే, సెమీస్లో లవ్లీనా విజయం సాధిస్తే.. ఫైనల్ చేరుతారు. ఫైనల్లో విజయం సాధిస్తే లవ్లీనాకు స్వర్ణం.. ఒకవేళ ఓడిపోతే రజతం వరిస్తుంది. అదీ కాకుండా సెమీస్లోనే లవ్లీనా ఓడిపోతే కాంస్య పతకం గెలుచుకోనుంది. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది.
#TokyoOlympics | Boxing, Women's Welterweight (64-69kg), Quarterfinal 2: Lovlina Borgohain beats Chinese Taipei's Chin-Chen Nien 4-1, assured of a medal pic.twitter.com/gxKKQkZee0
— ANI (@ANI) July 30, 2021