ఇద్దరూ స్టిక్కర్ బాబులే : సోము వీర్రాజు

by  |
somu veerraju
X

దిశ, ఏపీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ నిధులతో నాడు ప్రచారం చేసుకున్న చంద్రబాబు, నేడు జగన్ ​స్టిక్కర్ ​బాబులేనని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకు తాగు, సాగు నికర జలాలు ఇవ్వాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో నికర జలాలపై బీజేపీ ప్రధాన అజెండా అవుతుందని తెలిపారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు బీజేపీ సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. పవన్ ను తక్కువ చేశామనేది అపోహలేనన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పేర్కొన్నారు. మొన్న జరిగిన భారత్ బంద్ తెలంగాణలో ఫుల్ ఆంధ్రలో ఆఫ్ డే నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ముదిరెడ్డిపల్లి లో ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి, హిందూపురం జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్ర మోహన్ స్వామి పాల్గొన్నారు.


Next Story

Most Viewed