ఆంబోతులను వదిలి ఉత్తములపై కేసులా?

by  |
ఆంబోతులను వదిలి ఉత్తములపై కేసులా?
X

దిశ ఏపీ బ్యూరో: అచ్చోసిన ఆంబోతుల్లా అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నా వారిపై ఒక్క కేసు నమోదు చేయకుండా ఉత్తములైన టీడీపీ నేతలపై అక్రమకేసులు బనాయించడం న్యాయమా? అని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గురజాలలో టీడీపీ కార్యకర్త, దళిత యువకుడు విక్రమ్‌ను పోలీసులే హత్య చేయించటం దారుణమన్నారు. హత్యకు సంబంధించిన ఆధారులను విక్రమ్‌ తల్లి చూపించినా నిందితులపై చర్యలు లేవని మండిపడ్డారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఏపీలో చోటుచేసుకుంటున్న దౌర్జన్యాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed