- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : మావోయిస్టులే లక్ష్యంగా గగనతలం నుంచి పోలీసులు బాంబులతో దాడి చేసినట్లుగా ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్జెడ్సి) ప్రతినిధి వికల్ప్ బుధవారం మీడియాకి ప్రకటనతో పాటు ఫోటోలు, వీడియోలను సాక్ష్యంగా విడుదల చేశారు. పామేడు పోలీస్స్టేషన్ సమీపంలోని బొత్సలంక, పాలగూడెం గ్రామాల్లో ఈనెల 19న తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు డ్రోన్లను ఉపయోగించిన 12 బాంబులను పడేశారని చెప్పారు. అయితే, డ్రోన్ దాడికి ముందే మావోయిస్టులు ఈ స్థలాన్ని మార్చడం వలన ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే దండకారణ్యంలో పోలీసులు డ్రోన్లను ఉపయోగించి దాడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Next Story