మావోయిస్టులపై డ్రోన్‌‌ల ప్రయోగం.. బాంబులేసిన పోలీసులు..!

by  |
మావోయిస్టులపై డ్రోన్‌‌ల ప్రయోగం.. బాంబులేసిన పోలీసులు..!
X

దిశ, భద్రాచలం : మావోయిస్టులే లక్ష్యంగా గగనతలం నుంచి పోలీసులు బాంబులతో దాడి చేసినట్లుగా ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి) ప్రతినిధి వికల్ప్ బుధవారం మీడియాకి ప్రకటనతో పాటు ఫోటోలు, వీడియోలను సాక్ష్యంగా విడుదల చేశారు. పామేడు పోలీస్‌‌స్టేషన్ సమీపంలోని బొత్సలంక, పాలగూడెం గ్రామాల్లో ఈనెల 19న తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు డ్రోన్‌లను ఉపయోగించిన 12 బాంబులను పడేశారని చెప్పారు. అయితే, డ్రోన్ దాడికి ముందే మావోయిస్టులు ఈ స్థలాన్ని మార్చడం వలన ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే దండకారణ్యంలో పోలీసులు డ్రోన్‌లను ఉపయోగించి దాడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Next Story