నేనిక్కడ ఉండలేను.. రాజీనామా చేస్తున్న

by  |
నేనిక్కడ ఉండలేను.. రాజీనామా చేస్తున్న
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా అందరు సినీ అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఆయన మరణానికి పలువురు కారణం అని సుశాంత్ అభిమానులతో పాటు, పలువురు సినీ తారలు కూడా ఆరోపించారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం మళ్లీ వెలుగులోకి వచ్చింది. కంగనా రనౌత్‌, వివేక్‌ ఒబెరాయ్‌ వంటి వారు సైతం బాలీవుడ్‌ కొంత మంది చేతుల్లోనే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ‘క్విట్ బాలీవుడ్’ తెరపైకి వచ్చింది. థప్పడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా..‘చాలు.. నేనిక ఇక్కడ ఉండలేను.. బాలీవుడ్ నుంచి రాజీనామా చేస్తున్నా.. ” అని ట్వీట్ చేశారు. ఆయనతో పాటు మరికొందరు సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా కూడా బాలీవుడ్ చోడో అంటూ ట్వీట్ చేశారు. తాము ఇండస్ట్రీలోకి ప్రసిద్ధ దర్శకులను చూసి వచ్చామని వారు ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed