కంగనా రాక.. ముంబైలో టెన్షన్ టెన్షన్..!

by  |
కంగనా రాక.. ముంబైలో టెన్షన్ టెన్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో అధికార పార్టీ నేతలకు, నటి కంగనా రనౌత్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సుశాంత్ మృతి అనంతరం కంగనా ముంబై పోలీసుల తీరు, నెపోటిజం, బాలీవుడ్‌లో డ్రగ్స్ లింక్స్, ముంబైను pokతో పోలుస్తూ పలు సంచలనాత్మక కామెంట్స్ చేశారు. దీనిపై మండిపడ్డ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వబోమని.. ఒకవేళ వస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని కంగనా కోరగా కేంద్రం ఆమెకు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది.

అయితే, ఇన్నిరోజులు తన సొంతూరు హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన కంగనా ఇవాళ ముంబైకు బయలు దేరారు. మరికొద్ది గంటల్లోనే కంగనా ముంబైకి చేరుకోనున్నారు. ఆమెకు రక్షణగా 11 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు.

కంగనాకు వ్యతిరేకంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో ముంబైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కంగనాకు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ‘మహా’ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన కంగనా.. డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిరూపించాలని, డ్రగ్స్‌ టెస్ట్‌కు తాను సిద్దమని ట్వీట్‌ చేశారు. తనకు డ్రగ్‌ మాఫియాతో లింకులు ఉన్నాయని రుజువైతే ముంబైలో ఎప్పుడూ అడుగుపెట్టబోనని హోంమంత్రికి రీ కౌంటర్ ఇచ్చారు.


Next Story