‘పంజాబ్ ఐకాన్‌’గా సోనూసూద్

by  |
‘పంజాబ్ ఐకాన్‌’గా సోనూసూద్
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో వలసకూలీల పాలిట దేవుడిగా మారిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. సోనూ సూద్​ను ​’పంజాబ్​ ఐకాన్’​గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ ఎన్నికల అధికారి ఎస్.కరుణ రాజు ప్రతిపాదన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన సోనూ సూద్​ లాక్‌డౌన్ సమయంలో వలసకూలీలను ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు చేర్చి, వారి పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. మానవత్వాన్ని చాటుకొని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. అంతేగాకుండా ఆయన చేసిన సేవలకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

Next Story

Most Viewed