కూలీల వాహనం బోల్తా.. 35 మందికి గాయాలు

by  |
కూలీల వాహనం బోల్తా.. 35 మందికి గాయాలు
X

దిశ, వెబ్‎డెస్క్: ములుగు జిల్లా ఏలూరు నాగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్‌హెచ్ -163పై కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాజేడులో మిర్చి తోటల్లో పనిచేసేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed