బోలెరో బీభత్సం.. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి

by  |
బోలెరో బీభత్సం.. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్‌లో ఓ కారు అతివేగంగా జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. మృతులు సత్తమ్మ, వెంకమ్మగా గుర్తించారు. కారు బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, పాన్ డబ్బాలు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు బాధ్యుడైన బొలెరో వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రవీందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రూబినా నజీబ్, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డిలు పరిశీలించారు.


Next Story