వాగులో కొట్టుకొచ్చిన మృతదేహం డ్రైవర్‌ది కాదు

by  |
వాగులో కొట్టుకొచ్చిన మృతదేహం డ్రైవర్‌ది కాదు
X

దిశ, హుస్నాబాద్: మోయతుమ్మెద వాగులో కొట్టుకొచ్చిన మృతదేశం లారీ డ్రైవది కాదని మంగళవారం ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. ఆర్డీఓ వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరుకోలు గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకచ్చినట్టు గ్రామస్తులు సమాచారం అందించారని తెలిపారు.

ఈనెల 15వ తేదీన తెల్లవారుజామున బస్వాపూర్ గ్రామంలో సమీపంలో మోయతుమ్మెద వాగులో ఓ లారీ వాగులో కొట్టుకుపోగా ఆ ప్రమాదంలో లారీ క్లీనర్ ధర్మయ్య ప్రాణాలతో బయట పడ్డాడని డ్రైవర్ శంకర్ గల్లంతయ్యడని చెప్పారు. వరుకోలు గ్రామ సమీపంలో కనిపించిన మృతదేహాన్ని డ్రైవర్ కుటుంబ సభ్యులకు చూపించగా వారు శంకర్ మృతదేహాం కాదనడంతో అదే వాగులో మరల పూడ్చిపెట్టామన్నారు. డ్రైవర్ మృతదేహం కోసం ఎన్డీఆర్ఏఫ్ బృందాలు గాలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Next Story