అడవుల్లో అందమైన బోట్ ప్రయాణం.. వారి కోసం స్పెషల్ నెంబర్

by Sridhar Babu |

<p>దిశ, నాగార్జునసాగర్ : పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్‌లో నీటి మట్టం 590 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. రేపు హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలం‌కు లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, [&hellip;]</p>

అడవుల్లో అందమైన బోట్ ప్రయాణం.. వారి కోసం స్పెషల్ నెంబర్
X

దిశ, నాగార్జునసాగర్ : పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్‌లో నీటి మట్టం 590 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. రేపు హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలం‌కు లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులు పంచనుంది.

గత రెండు నెలల కింద ప్రారంభమైంది కానీ పర్యాటకులు రాకపోవడం వలన నడపలేదు ప్రస్తుతం బుకింగ్‌లు రావడం‌తో రేపు 29-11-2021రోజున ఉదయం 9గంటలకు నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం లాంచ్ ప్రారంభమవును,(తెలంగాణ వైపు నుండి) నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంలాంచ్ ప్రయాణానికి గాను టికెట్ One way కి పెద్దలకు1500 చిన్న పిల్లలకు 4సంవత్సరాలనుండి12సంవత్సరాలు,1200 2way కి పెద్దలకు2500 2way పిల్లలకు2000 హైదరాబాద్ నుండి వచ్చే వారికి BUS ప్యాకేజ్ పెద్దలకు3999 పిల్లలకు3399. వివరాల కోసం ఈ ఫోన్:9848540371CRO బషీర్ బాగ్, నాగార్జునసాగర్7997951023Online booking కొరకు www.tstdc.inని సంప్రదించ గలరు.

Next Story