విశాఖ సముద్రంలో బోటు బోల్తా.. ఆందోళనలో మత్స్యకారులు

by  |
విశాఖ సముద్రంలో బోటు బోల్తా.. ఆందోళనలో మత్స్యకారులు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ సముద్రంలో విషాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన నాటు బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో 8 మంది మత్స్యకారులు ఉన్నారు. అయితే, ఇందులో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డా.. ఒకరు సముద్రంలో గల్లంతు అయ్యారు. గల్లైంతన వ్యక్తి జగ్గా అని సదరు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. జగ్గా గల్లంతు అయ్యాడని వార్త విన్న బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సముద్ర అలలకు పడవ బోల్తా పడడంతో మత్స్యకారులు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు.

Next Story

Most Viewed