- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఆయా కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై మొగ్గు చూపుతున్నాయి. ఇక జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ వచ్చే ఆరు నెలల్లో ఇండియాలో మూడు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మూడు నెలల్లో పూర్తి ఎలక్ట్రిక్ మినీ లగ్జరీ హ్యాచ్బ్యాక్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్ను రెండు మోటార్లతో తీసుకురానున్నట్లు బీఎండబ్ల్యూ తెలిపింది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారుతోపాటు హోం చార్జింగ్ కిట్ను అందించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ డీలర్షిప్ కేంద్రాల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఇంధన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది.