అందరి కోసం మా పార్టీ….

by  |
అందరి కోసం మా పార్టీ….
X

దిశ, దుబ్బాక: ఊళ్లో నలుగురి ప్రయోజనం కోసం అయితే టీఆర్ఎస్‌కు, అందరి ప్రయోజనం కోరుకుంటే బీజేపీకి ఓటు వేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు మిథున్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని నగరం, తాళ్లపల్లి, పోతారెడ్డిపేట గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా యువకులు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించిన తెలంగాణలో ప్రజల జీవితాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసిందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యవంతమై ఈసారి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఊరికి నలుగురు బాగుపడ్డారు తప్పితే దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదన్నారు. ఈ సారి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అందుకే దుబ్బాకలో ఈసారి బీజేపీ గెలుస్తుందని అన్నారు.

Next Story

Most Viewed