దళితబంధు కోసం బీజేపీ దళిత మోర్చా పోరు దీక్ష..

by  |
దళితబంధు కోసం బీజేపీ దళిత మోర్చా పోరు దీక్ష..
X

దిశ, దుగ్గొండి : నర్సంపేట నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని వెంటనే అమలుచేయాలని బీజేపీ దళిత మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ దళితులకు అనేక హామీలు ఇచ్చి వారిని విస్మరించారని నియోజకవర్గంలోని గిర్నిబావి సెంటర్లో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో దళిత బంధుపై పోరు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.

హుజురాబాద్ మాదిరిగా నర్సంపేట నియోజకవర్గంలో కూడా దళితులు అధిక సంఖ్యలో ఉన్నారని, కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. దళిత బంధుకై పోరు దీక్ష కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, మండలాధ్యక్షుడు చుక్క రమేష్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచాల సతీష్, నాయకులు వడ్డేపల్లి కృష్ణ, మొకీడే ప్రభాకర్, అర్షం రాజయ్య, కొలగాని రవి సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు.



Next Story

Most Viewed