ప్ర‌భుత్వం జిమ్మిక్కులు చేస్తోంది

by  |
ప్ర‌భుత్వం జిమ్మిక్కులు చేస్తోంది
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్:
దుబ్బాక ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్ధి ర‌ఘునంద‌న్ రావు విజ‌యం ఖాయ‌మ‌ని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్ అన్నారు. దుబ్బాక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సిద్ధిపేట్, దౌల్తాబాద్ మండ‌లాల్లో ప‌ర్య‌టించి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ… భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్ధి ర‌ఘునంద‌న్ రావుకు దుబ్బాక ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నార‌ని అన్నారు. ఉప ఎన్నిక‌లో ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌న్నారు. రాష్ట్రంలో డ‌బుల్ బెడ్ రూమ్ ల పేరుతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం జిమ్మిక్కులు చేస్తోంద‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ఇండ్లు క‌ట్టించారో గ‌ణాంకాలు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ‌ర‌ద‌లు వ‌స్తే ప్ర‌భుత్వం ఇచ్చే స‌హాయంలో కూడా రాజ‌కీయం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌రుగ‌నుండ‌డంతో హైద‌రాబాద్ లో వ‌ర‌ద స‌హాయాన్ని అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నాయ‌కులు పావులు క‌దుపుతున్నార‌ని ఆరోపించారు. ముంపు బాధితుల‌కు ఇచ్చే ప‌రిహారంలో చెరి స‌గం అనేలా అధికారులు, అధికార పార్టీ నాయ‌కులు, కార్పొరేట‌ర్లు పంచుకుని పేద‌ల‌ను మోసం చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌లు వీటన్నింటిని గ‌మ‌నిస్తున్నార‌ని దుబ్బాక ఎన్నిక‌ల‌తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఆయ‌న అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed