బీజేపీ నిరుద్యోగ దీక్ష స్థలం మార్పు

by  |
bandi-sanjay-12
X

దిశ, వెబ్‌డెస్క్: రేపు తెలంగాణ బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష స్థలం మారింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షల నేపథ్యంలో దీక్షా స్థలాన్ని బీజేపీ మార్చింది. ఇందిరాపార్క్ నుంచి బీజేపీ రాష్ట్ర ఆఫీస్ కి మార్చారు. నిరుద్యోగుల సమస్యపై పోరాటంలో భాగంగా ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టాలని తొలుత బీజేపీ నిర్ణయించింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరణంలో నిరుద్యోగ దీక్షకు బీజేపీ పూనుకుంది. కానీ ఒమిక్రాన్ నేపథ్యంలో బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో దీక్షా వేదికను మార్చారు.

Next Story

Most Viewed