నేడు బండి సంజయ్ దీక్ష

by  |
నేడు బండి సంజయ్ దీక్ష
X

జీఓ నెంబరు 203ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నేడు బీజేపీ నేతలు దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ ఇళ్లలోనే నిరసన దీక్షకు దిగనున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నంబరు 203ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జీఓ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరభగీరథుడిగా తన పార్టీ నేతలతో పొగిడించుకున్న సీఎ కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నా.. జగన్ ప్రభుత్వంపై ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరంగా బీజేపీ మాజీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్ మండిపడ్డారు.

Next Story

Most Viewed