ఉగ్రవాదుల ఓట్ల కోసం టీఆర్ఎస్ కక్కుర్తి : బండి సంజయ్

by  |
ఉగ్రవాదుల ఓట్ల కోసం టీఆర్ఎస్ కక్కుర్తి : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధంవున్న వ్యక్తులతో సానుకూలంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్.. వారి ఓట్ల కోసం కక్కుర్తి పడి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. అసలు వీళ్లు సెక్యులర్ వాదులా..దేశభక్తులా..? నగరంలో హిందువులను వెల్లగొట్టడమే టీఆర్ఎస్, మజ్లీస్ లక్ష్యమా? అంటూ ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ప్రశ్నించారు.

తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే గతంలో రూ.10వేలు పొందిన వరద బాధితులకు అదనంగా ఇస్తాం. ఒకవేళ ఎంఐఎంకు మేయర్ పీఠం కట్టబెడితే హిందువులను ఆలయాలకు కూడా వెళ్ళనివ్వరు. వీరి కుట్రను గ్రహించి జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేయాలి’ అంటూ సంజయ్ పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed