బీజేపీ రాష్ట్ర కోశాధికారి.. కరోనాతో మృతి

by  |
బీజేపీ రాష్ట్ర కోశాధికారి.. కరోనాతో మృతి
X

దిశ,బేగంపేట( హైదరాబాద్) : బీజేపీ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాను కరోనా తో బాధపడుతూ ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరారు.. కరోనా తో పాటు నిమోనియా వ్యాధి కూడా చేకూరడంతో రోజురోజుకు వారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన శనివారం ఉదయం మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు.

వర్మ సనత్ నగర్ నియోజకవర్గ మొండా డివిజన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి . తాను చాలా కాలం పాటు బీజేపీలో పని చేశారు. గతంలో సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జీగా కొనసాగారు. అలానే 2002 లో మొండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గా గెలుపొందడం జరిగింది. 2018లో సనత్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వర్మ కి నలుగురు కూతుళ్లు ఒక కుమారుడున్నాడు.. ఇటీవల వర్మ చికిత్స పొందుతున్న సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నాయకులు, మురళీధర్ రావు, తదితరులు వర్మ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. వర్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం మొండా డివిజన్ లో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



Next Story

Most Viewed