‘అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీయాలి’

by  |
‘అత్యాచారం చేసిన వ్యక్తిని ఉరితీయాలి’
X

దిశ, రంగారెడ్డి: మైనర్‌పై అత్యాచారం చేసిన ఎంఐఎం నాయకుడిని వెంటనే ఉరి తీయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి జనార్ధన్ రెడ్డి అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఆయన తన నివాసంలో ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తల్లీ తండ్రి లేని దళిత బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరి తీయాలన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని తాము పోరాటం చేస్తుంటే ఎంఐఎం ఎమ్మెల్యే దళితులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని చెప్పారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


Next Story