కాసేపట్లో ఆ ఆలయానికి బండి సంజయ్

by  |
కాసేపట్లో ఆ ఆలయానికి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాబ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. బల్దియా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం జోరుగా నిర్వహించారు. కాగా రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం బండి సంజయ్ సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయానికి రానున్నారు. బీజేపీ గెలుపు కోసం బండి సంజయ్ ఉదయం 9 గంటలకు అమ్మవారిని సందర్శించి అమ్మ ఆశీస్సులు తీసుకోనున్నారు. అనంతరం బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లనున్నారు.


Next Story

Most Viewed