- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ శాసన సభ ఎదురుగా ఇటీవల నాగులు అనే ఓ వ్యక్తి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని ఆవేదన వక్తం చేశారు. గతంలో రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే, నేడు బతకలేక ఆత్మ హత్య చేసుకోవడం బాధాకరమన్నారు.
నాగులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణమని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం మూలంగానే రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.
Next Story