'ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ని సద్వినియోగం చేసుకోండి'

by  |
ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ని సద్వినియోగం చేసుకోండి
X

దిశ, నల్గొండ: కరోనా కష్ట కాలంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవనికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్రమోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాయు మిత్ర, సేవహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి స్నేహితుడి కూతురు అట్లూరి ఉమ(USA)వారి సహకారంతో నిమిషానికి 7 లీటర్ల ఉత్పత్తి చేయగల ఆక్సిజన్ కాన్సట్రేటర్ ని(3) నేడు బీజేపి సీనియర్ నాయకులు బోళ్ల సుదర్శన్ కి గూడూరు నారాయణరెడ్డి చేతుల మీదగా అందజేశారు.

పార్టీలకి అతీతంగా కరోనా బారిన పడిన వారు ఎవరైనా ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను ఉపయోగించుకోగలరని వారికి అవసరం ఉంటే బీజేపీ మండల శాఖ వారిని సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఉపసర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు మైసోళ్ల మత్యగిరి, గోకికర్ బన్సీలాల్, గట్టు రాజు, అప్పీశెట్టి సంతోష్, దొగిపర్తి సంతోష్ వార్డు మెంబెర్, మైసోళ్ల మత్స్యగిరి,బుంగమట్ల మహేష్,బార్ల మల్లేష్,కనతల అశోక్ రెడ్డి,మెదరి నరేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed