- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పోలింగ్ తేది సమీపించడంతో BJP పార్టీ ముఖ్య నాయకులు హుజురాబాద్లో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హుజురాబాద్లో పర్యటించే నాయకుల షెడ్యూల్ను విడుదల చేశారు. జాతీయ, ప్రాంతీయ నాయకులు ఈ నెల 20-27తేదీల మధ్య బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తారని వివరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బుధవారం జమ్మికుంట మండలంలో, 21న హుజూరాబాద్ మండలంలో, అక్టోబర్ 22న కమలాపూర్ మండలంలో ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. అలాగే, బుధవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, డాక్టర్ వివేక్లు ప్రచారంలో పాల్గొంటారని అన్నారు.
21న విజయశాంతి, 22, 23 తేదీల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, 22న జమ్మికుంట పట్టణంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వీణవంక మండలంలో ఎంపీ అరవింద్, హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావులు పర్యటించనున్నారని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 22న కమలాపూర్ మండలంలో బండి సంజయ్తో పాటు మాజీ మంత్రి బాబుమోహన్ పాల్గొననున్నారు.