- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జీఎస్ బావా ఆత్మహత్య చేసుకున్నారు. బావా పశ్చిమ ఢిల్లీలోని ఫతేనగర్ లో నివసిస్తున్నారు. అయితే అతను నిన్న సాయత్రం తన ఇంటి సమీపంలోని పార్క్ లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న బావాని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే తన కుటుంబ సమస్యల వలనే తాను ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టుగా వారు తెలిపారు. ఆయన వద్ద నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story