నిజాంపేట కార్పొరేషన్ ఎదుట బీజేపీ ధర్నా

by  |
నిజాంపేట కార్పొరేషన్ ఎదుట బీజేపీ ధర్నా
X

దిశ, మేడ్చల్
మేడ్చల్ జిల్లా పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట బీజీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కార్పొరేషన్ లో కార్పొరేటర్లుగా గెలిచి 50 రోజులు గడుస్తున్నా.. కాలనీల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. గెలిచిన నాటి నుంచి ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. కాలనీల్లో ఐదారు రోజులకోసారి 200 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారని, ఈ నీటితో ఐదు రోజులు ఏలా సర్దుకోవాలని మండిపడ్డారు. నీటి బిల్లులు మాత్రం అధికంగా వస్తున్నాయని పేర్కొన్నారు.

Tags: bjp protest, nizampet corporation, for 50 days no development, Although funds are being released

Next Story