ఏమాత్రం ఆసక్తి లేదు: శివరాజ్ సింగ్

by  |
ఏమాత్రం ఆసక్తి లేదు: శివరాజ్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభమనేది కేవలం కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తమ పార్టీ ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. అంతకుముందు దిగ్విజయ్‌సింగ్‌సహా పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని, అందుకు గుర్రపు వ్యాపారం చేస్తున్నదని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. సోమవారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లో 20 మంది కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. వారి రాజీనామాను కమల్‌నాథ్ ఆమోదించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed