బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా

by  |
బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా
X

న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గత నాలుగు రోజులుగా ఆయన గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా వైరస్ సోకింది. కానీ, ఆమెకు వైరస్ లక్షణాలు లేవు. దీంతో ఇద్దరినీ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Next Story

Most Viewed