ఆ పార్టీలకు భవిష్యత్తు లేదు: జీవీఎల్

by  |
ఆ పార్టీలకు భవిష్యత్తు లేదు: జీవీఎల్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. కాంగ్రెస్ ప్రతిష్ట మరింత దిగజారిందన్నారు. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, ఇప్పటికే చాలా మందికి అర్థమైందన్నారు. అందుకే కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ లాంటి వంశ పారంపర్య పార్టీలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ రెండు ఒకటేనని, ఆ పార్టీలకు భవిష్యత్తు లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని జీవీఎల్ అన్నారు. కాంగ్రెస్ తల్లీతనయుల పార్టీ, టీడీపీ తండ్రీతనయుల పార్టీ అని తనదైన శైలిలో విమర్శించారు.



Next Story

Most Viewed