కేంద్ర పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి: జీవీఎల్

by  |
కేంద్ర పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి: జీవీఎల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. టీడీపీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదని అన్నారు. కుటుంబ రాజకీయాలతో టీడీపీ అధికారానికి దూరమైందని జీవీఎల్ విమర్శించారు. కాంగ్రెస్‌లో రాహుల్.. టీడీపీలో లోకేశ్‌ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని జీవీఎల్ అన్నారు.



Next Story

Most Viewed