‘అగ్గిరాజుకుంటున్నది.. అది బీజేపీ గెలుపు కోసమే’

by  |
‘అగ్గిరాజుకుంటున్నది.. అది బీజేపీ గెలుపు కోసమే’
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ నేతలు అందరూ కేసీఆర్‌లాగే తయారవుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేసీఆర్‌లాగే ఇంత దోపిడీ ఉంటే నగరం ఎలా అభివృద్ధి చెందుతుందని ధర్మపురి ప్రశ్నించారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన టీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ మతకల్లోహాలు జరిపేందుకు ప్లాన్ చేస్తుందని తండ్రీ కొడుకులు అసత్య ప్రచారాలు చేశారన్నారు. నిజానికి టీఆర్ఎస్ హయాంలోనే భైంసాలో మతకల్లోహాలు జరిగాయని ధర్మపురి విమర్శించారు.

హిందువుల పై దాడులు జరిగేది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అంటూ మండిపడ్డారు. ఎంఐఎం చేతిలో అమ్ముడుపోయిన కేసీఆర్, కేటీఆర్ ఆడుమంటే ఆడుతారు, పాడుమంటే పాడుతారు అని ఎద్దేవా చేశారు. ఈ విషయం పై కేసీఆర్, కేటీఆర్ సరైన సమాధానం చెప్పకపోవడం సిగ్గుచేటని ధర్మపురి అభిప్రాయపడ్డారు. హిందువులు ఆత్మాభిమానాన్ని కల్వకుంట్ల కుటుంబం హోల్ సేల్‌గా అమ్మేశారని అర్వింద్ ఆరోపించారు.

అగ్గి రాజుకుంటుందని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారని.. అసలు యువత ఉన్నది అగ్గిరాజేందుకే అని ధర్మపురి తేల్చి చెప్పారు. ఇది వరకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో అగ్గిరాజేసిన యువత బీజేపీకి పట్టం కట్టారన్నారు. ఇటీవల దుబ్బాకలో కూడా ఇలాగే చేశారన్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా యువత అగ్గి రాజేసి బీజేపీని గెలిపించాలని ధర్మపురి అర్వింద్ పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed