అసెంబ్లీ నుంచి ‘సుప్రీం’కు

by  |
అసెంబ్లీ నుంచి ‘సుప్రీం’కు
X

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలను స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి పదిరోజులపాటు(మార్చి 26వ తేదీ వరకు) వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. స్పీకర్ నిర్ణయంతో కమల్‌నాథ్ సర్కారు ఎదుర్కోవాల్సిన విశ్వాస పరీక్షను కూడా వాయిదా వేసినట్టయింది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12 గంటల్లో కమల్‌నాథ్ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు(మంగళవారం) విచారించే అవకాశమున్నట్టు తెలిసింది.

tags : madhya pradesh, floor test, supreme court, kamalnath govt

Next Story

Most Viewed