ఉద్యోగం పేరుతో మహిళ ఇంటికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే.. గదిలోకి వెళ్లి..

by  |
BJP logo
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారిపై బీజేపీ ఎమ్మెల్యే లైంగిక దాడి చేసిన ఘటన రాజస్థాన్‌లో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఉద్యోగం కోసం ఎమ్మెల్యేను కలిస్తే తాను ఉద్యోగం సాకుతో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం కోసం గోగుండ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్‌భీల్ ను కలిశానని, తాను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని, కానీ, అప్పటి నుంచి అతడు ఏదో ఒక నెపంతో తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడని, గతేడాది మార్చిలో తన ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని కూడా ఆరోపించింది. ఇదే కాకుండా 10 నెలల క్రితం కూడ ఓ మహిళ తనపై ఎమ్మెల్యే ఉద్యోగం ఇప్పిస్తానని అత్యాచారం చేశారని ఎస్పీని ఆశ్రయించింది. 10 నెలల్లో ఎమ్మెల్యే పై రెండు కేసులు నమోదవడం సర్వత్రా చర్చానీయశం అయ్యింది.



Next Story