మైనంపల్లి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన రాజాసింగ్(వీడియో)

by  |
BJP MLA Rajasingh, Mainampalli Hanmantrao
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… ‘‘నీవు బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేయలేదా? నీ నేర చరిత్ర తెలిసే పార్టీలోకి చేర్చుకోలేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మేము మాట్లాడడం మొదలు పెడితే మైనంపల్లి తట్టుకోలేరు. బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నం చేశారు. ఆయన చరిత్ర తెలిసి పార్టీలో చేర్చుకోలేదు.’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్పొరేటర్‌పై మైనంపల్లి దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మైనంపల్లి వ్యాఖ్య చేయడాన్ని ప్రశ్నించారు. పిచ్చి పట్టిన అనంతరం కుక్క ఏ మాదిరిగా ప్రవర్తిస్తుందో మైనంపల్లి కూడా అలా మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు.

ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన తీరు ఇలానే ఉంటుందా? అని నిలదీశారు. ‘బండి సంజయ్ ఏం తప్పు చెప్పలే, నీవు చేసిన పాపం గురించే ఆయన మాట్లాడారు. నీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నీవు ఏ అంటే జడ్ వరకు నీకు మంచిపాఠాలు నేర్పిస్తాము.’’ అని మైనంపల్లిని ఉద్ధేశించి రాజాసింగ్ అన్నారు. బీజేపీలోకి రావాలని బండి సంజయ్ చుట్టూ తిరిగాడని, ఢిల్లీలో కూడా తిరిగాడని, ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. నీవు ఇలాంటి వ్యక్తివనే తెలిసి బీజేపీ నిన్ను యాక్సెప్ట్ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి నా కాళ్లు మొక్కిండు అందుకే టీఆర్ఎస్‌లో ఉండిపోయా అని చెప్తున్నావ్, దీనిని బట్టి చూస్తే నీ పరిస్థితి అక్కడ, ఇక్కడ కాకుండా పోయిందనేది అర్ధం అవుతోందన్నారు. టీఆర్ఎస్ వాళ్లు నిన్ను లాట్ కొట్టి బయటకు పంపిస్తారు. ముఖ్యమంత్రి చెబితేనే నీ పైన ఎఫ్ఐఆర్ అయింది అనేది తెలుసుకో అని రాజాసింగ్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed