కుట్ర లేకుంటే.. ఎందుకు అనుమతించడం లేదు

by  |
కుట్ర లేకుంటే.. ఎందుకు అనుమతించడం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బుధవారం బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించాడు. శ్రీశైలం ప్రమాదంపై వాస్తవాలు తెలసుకోవడానికి ప్రతిపక్ష నాయకులు వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇందులో ఏదో కుట్ర జరిగి ఉంటుందని, అందుకే ప్రమాద స్థలికి అనుమతించడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed