కేసీఆర్‌ను కుక్కలతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే

by  |
కేసీఆర్‌ను కుక్కలతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే
X

దిశ హాలియా: ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలను కుక్కలతో పోల్చిన కేసీఆర్‌ని ఓటు అనే ఆయుధంతో తొక్కితే పాతాళంలోకి పోతారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలిదశ ఉద్యమంలో తెలంగాణ నీళ్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ నీళ్లు తేలే కానీ… కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలను నింపుకున్నారని ఆరోపించారు. గురువారం హాలియాలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంను ఉద్దేశిస్తూ.. ప్రజలను ఏ భాషతో పోల్చారో అదే గతి రానున్న రోజుల్లో కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు. కుండకు మూడు చిల్లులు పూర్తయ్యే పరిస్థితి కూడా దగ్గర్లోనే ఉందని.. ఒకటి దబ్బాకలో బావకు చిల్లు పెట్టగా.. రెండవది జీహెచ్‌ఎంసీలో బావమరిదికి పెట్టారని ఎద్దేవా చేశారు. ఇక మూడవది వచ్చే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో ముసలోడికి కూడా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.


Next Story