ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

by  |
ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థపై దృష్టిసారించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌‌రావు అన్నారు. ఆర్భాటంగా ప్రారంభించిన టిమ్స్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అదుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. గురువారం గచ్చిబౌలి టిమ్స్‌ను బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, యోగానంద్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్. రామచందర్‌రావు మాట్లాడుతూ ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌ను తయారు చేస్తామని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసి నెలలు గడుస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిందన్నారు.



Next Story

Most Viewed