విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు

by  |
విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు
X

దిశ, ఆదిలాబాద్: ప్రజలపై ప్రభుత్వం అడ్డగోలుగా కరెంట్ బిల్లుల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్ ఈ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడించారు. అనంతరం వారు ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు, రాష్ట్ర నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, ఒడిసెల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, బిజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అయ్యన్నగారి రాజేందర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed