హర్యానా గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు…

by Ramesh Goud |

<p>దిశ, జనగామ: భారతీయ జనతాపార్టీ జనగామ జిల్లా నేతలు ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని చండీగఢ్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. బీజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల ధశమంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి, బేజాడి బీరప్ప తదితరులు చండీగఢ్ లో దత్తాత్రేయని కలిసిన వారిలో ఉన్నారు.ఈసందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ తెలంగాణ లోని ఆలయాల స్థితి గతులు తెలుసుకోవడం జరిగిందని, ముఖ్యంగా జనగామ [&hellip;]</p>

హర్యానా గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు…
X

దిశ, జనగామ: భారతీయ జనతాపార్టీ జనగామ జిల్లా నేతలు ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని చండీగఢ్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. బీజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల ధశమంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి, బేజాడి బీరప్ప తదితరులు చండీగఢ్ లో దత్తాత్రేయని కలిసిన వారిలో ఉన్నారు.ఈసందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ తెలంగాణ లోని ఆలయాల స్థితి గతులు తెలుసుకోవడం జరిగిందని, ముఖ్యంగా జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర ఆలయం గురించి, భక్త పోతన మెమోరియల్ నిర్మాణాలు, సోమేశ్వర,లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి పై ఆరా ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి తెలిపారు.

Next Story