ఎన్నికల ఎఫెక్ట్.. బీజేపీ, జనసేన రథయాత్రకు బ్రేక్

by  |
ఎన్నికల ఎఫెక్ట్.. బీజేపీ, జనసేన రథయాత్రకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాల పరిరక్షణ కోసం బీజేపీ-జనసేన పార్టీలు రథయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర ఫిబ్రవరి-04న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని ఇరు పార్టీల నేతలు భావించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రకటించడంతో రథయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల అనంతరం చర్చించి మరోసారి రథయాత్ర ప్రారంభ తేదీ ఖరారు చేస్తామని ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed