కరోనా విజృంభిస్తున్నా.. పట్టించుకోవట్లే

by  |
కరోనా విజృంభిస్తున్నా.. పట్టించుకోవట్లే
X

దిశ, చెన్నూర్ : చెన్నూర్ పట్టణంలో కరుణ వైరస్ సోకి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నప్పటికీ అధికారులలో ఎటువంటి చలనం లేదని బీజేపీ నేతలు నగునూరు వెంకటేశ్వర గౌడ్, సుశీల్ కుమార్ లు అన్నారు.

శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ గతవారం రోజులుగా చెన్నూర్ పట్టణంలో నిర్వహిస్తున్న టెస్టుల ఆధారంగా రోజురోజుకు కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతుందని, వీధులలో ఎటువంటి క్లోరినేషన్ గానీ, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయించడం, వీధులలో చెత్తను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ లు నిర్వహిస్తున్న సిబ్బందికి నాణ్యత గల మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు లేకపోవడం విచారకరమన్నారు. రాబోయే కాలంలో వైరస్ సోకి రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని వారు కోరారు.



Next Story

Most Viewed