- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,తెలంగాణ బ్యూరో: పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని గుండు అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చూసుకుంటే బాగుంటుందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ హేద్దేవా చేశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా,బీజేపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎంపీ నేతగాని వెంకటేష్.. సంజయ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇకనైనా ఆయన తన పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ఎంపీ వెంకటేష్ కు కనీస గౌరవం లేదని, వారిని గాడిదలతో పోల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టారన్నారు. 2019 లో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలువగానే గతంలో తాను చేసిన కామెంట్స్ మరచిపోయి కేసీఆర్ ను పొగడడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమన్నారు.