‘చంద్రబాబు పచ్చి అవకాశవాది’

by  |
‘చంద్రబాబు పచ్చి అవకాశవాది’
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు‌వర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందంటూ చంద్రబాబు.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు.

చంద్రబాబు ఫోన ట్యాపింగ్ అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చంద్రబాబు గతంలో చేసిన దిగజారుడు వ్యాఖలను కోట్ చేస్తూ చురకలు అంటించారు.‘‘ నీకు భార్య, కుటుంబం బంధాలు లేవు. మా అభివృద్ధిని ఓర్వేకపోతున్నారు. నీ కంటే నేను ముందే సీఎం అయ్యాను. గుజరాత్‌ని ఏం అభివృద్ధి చేశావు? మీకు మేము బానిసలం కాదు. మీరు పబ్లిసిటీ పీఎం. మీరు పనిచేసే పీఎం కాదు. మాకు పనిచేసే పీఎం కావాలి” అంటూ గతంలో మోదీపై చేసిన వ్యాఖ్యలు గుర్తు ఉందా బాబు గారు అని ట్వీట్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని సర్వనాశం చేసింది బాబేనని విమర్శించారు.

Next Story