వారికిచ్చారు.. మాకెందుకు ఇవ్వరు?

by  |
వారికిచ్చారు.. మాకెందుకు ఇవ్వరు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. రామతీర్థం వెళ్లేందుకు విజయసాయిరెడ్డి, చంద్రబాబుకు అనుమతిచ్చి తమకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పోలీసులతో దమనకాండ చేయిస్తారా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రాముడికి అపకారం జరిగితే తమను అనుమతించరా.. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామతీర్థాన్ని సందర్శించేందుకు బేషరతుగా తమకు అనుమతి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై ప్రజా పోరాటం చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.


Next Story