టీడీపీ-వైసీపీ కలిసిపోయి.. జనసేన-బీజీపీని టార్గెట్ చేశాయి

by  |
టీడీపీ-వైసీపీ కలిసిపోయి.. జనసేన-బీజీపీని టార్గెట్ చేశాయి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-వైసీపీ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ-వైసీపీ ఒక్కటైపోయి, జనసేన-బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. తిరుపతి నుంచే జనసేన-బీజేపీ జైత్రయాత్ర ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని అన్నారు. టీడీపీ సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలను తాము వెళ్లి పరామర్శిస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed