ప్రభుత్వం హింసా రాజకీయాలను రెచ్చగొడుతోంది

by  |
ప్రభుత్వం హింసా రాజకీయాలను రెచ్చగొడుతోంది
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. నిధులు కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది అని మండిపడ్డారు.

ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన యాప్‌నకు తాము వ్యతిరేకం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరగాలని కోరారు. నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలో తప్పుడు కేసులతో ఇద్దరు మద్దతుదారులను వేధిస్తున్నారని సోమువీర్రాజు విమర్శించారు. ప్రభుత్వం హింసా రాజకీయాలను రెచ్చగొడుతోందన్నారు.


Next Story

Most Viewed