- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొమ్మా గిమ్మా అంటే పళ్ళు రాలగొడతారు నారాయణ
<p>దిశ,వెబ్ డెస్క్ : బీజేపీ మహిళా నేత సాధినేని యామిని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉన్న రామాలయంలో సీతమ్మ వారి విగ్రహాం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.., ఎలుకలు పడేయడం వల్లే విగ్రహం విరిగిపోయిందని సీఐ వ్యాఖ్యానించారు. అయితే సీఐ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై సాధినేని యామిని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యాభై ఏళ్లుగా ఏమీ చేయలేని ఎలుకలు హఠాత్తుగా […]</p>

దిశ,వెబ్ డెస్క్ : బీజేపీ మహిళా నేత సాధినేని యామిని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉన్న రామాలయంలో సీతమ్మ వారి విగ్రహాం ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.., ఎలుకలు పడేయడం వల్లే విగ్రహం విరిగిపోయిందని సీఐ వ్యాఖ్యానించారు. అయితే సీఐ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంపై సాధినేని యామిని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యాభై ఏళ్లుగా ఏమీ చేయలేని ఎలుకలు హఠాత్తుగా విగ్రహాన్ని పడగొట్టాయంటే, అవి ఖచ్చితంగా నిన్నో మొన్నో మతం మారి ఉంటాయంటూ చురకలంటించారు.
“మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వెక్కిరించేవారు, అవమానించేవారు, అడ్డుకునేవారు, అపహాస్యం చేసేవారు ఎంతమంది ఉన్నా మన ధర్మం మనం పాటిస్తూ వెల్లడమే. మనమేంటో ద్వేషించే వారికి తప్పక తెలిసి వస్తుంది.”
“చైనాకి ఊడిగం చేస్తూ, హైందవాన్ని మాత్రమే చులకన చేసి, నాశనం చేసే నారాయణగారు, మీరు ఇంకా ఇలా పెట్రేగి వాగే ఆ నోరు పనిచేస్తుంది అంటే అది మా దేవుడి భిక్ష. హిందూ దేవుళ్లను బొమ్మా గిమ్మా అంటే పళ్ళు రాలగొడుతారు హిందువులు’ అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు”.






