హిందూ పండుగలపైనే ఆంక్షలెందుకు.. బసగల్ల ఆగ్రహం

by  |
BJP leader Ramulu Goud
X

దిశ, శంకర్‌పల్లి: తెలంగాణ ప్రభుత్వం కేవలం హిందూ పండుగలపైనే ఆంక్షలు విధించడం సిగ్గుచేటు అని శంకరపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు బసగల్ల రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సురేష్ విమర్శించారు. గణేష్ నిమజ్జనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిరసన తెలుపుతుండగా, పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ శాంతిని కోరుకుంటోందని స్పష్టం చేశారు. హిందువులకు అతిపెద్ద పండగైన వినాయక చవితి నిమజ్జనానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, మండల కార్యదర్శి రామకృష్ణారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు లోకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed